కలం, వెబ్ డెస్క్ : రాబోయే సమ్మర్ లో బీర్ల (Beer) తయారీని మరింత పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం బ్రూవరీలను ఆదేశించింది. సమ్మర్ లో బీర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి.. ఆ మేరకు ఉత్పత్తికి ఏర్పాట్లు చేసుకోవాలని ఎక్సైజ్ కార్యదర్శి రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ తెలిపారు. మంగళవారం బ్రూవరీలను వీరిద్దరూ పరిశీలించి.. కంపెనీలకు కీలక సూచనలు చేశారు. గతేడాది వేసవిలో బీర్లు 2.30లక్షల కేసులు అమ్ముడయ్యాయని.. ఈ సమ్మర్ లో 2.50 లక్షల కేసుల దాకా చేరొచ్చని రఘునందన్ రావు, హరి కిరణ్ అంచనా వేశారు. బీర్ల సరఫరాలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలన్నారు.
Read Also: టెకీలకు టీసీఎస్ మరో షాక్
Follow Us On: Youtube


