epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హోరాహోరీ పోరులో జెయింట్స్​దే గెలుపు

కలం, వెబ్​డెస్క్: మహిళల ప్రీమియర్​ లీగ్​లో మరో ఉత్కంఠ భరిత పోరు. ఆదివారం ముంబైలోని డీవై పాటిల్​ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్​ జెయింట్స్ ​(Gujarat Giants) మహిళల మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు హోరాహోరీగా సాగింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్​లో జెయింట్స్​ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన జెయింట్స్​.. సోఫీ డివైన్​ (95; 42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్​లు) ధనాధన్​ ఇన్నింగ్స్​కు తోడు, కెప్టెన్​ ఆష్లే గార్డెనర్​(49; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్​లు) మెరుపులు తోడవడంతో సరిగ్గా 20 ఓవర్లకు 209 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. ఢిల్లీ జట్టులో నందని శర్మ 5 వికెట్లు పడగొట్టింది. షినెల్లీ హెన్రీ, తెలుగమ్మాయి శ్రీ చరణి చెరో రెండు వికెట్లు, షఫాలీ వర్మ 1 వికెట్​ తీశారు.

ఛేదనలో ఢిల్లీ సైతం ధాటిగా ఆడింది. ఓపెనర్​ షఫాలీ వర్మ(14; 12 బంతుల్లో 2 ఫోర్లు) త్వరగానే అవుటైనప్పటికీ మరో ఓపెనర్​ లిజెల్లీ లీ (86; 54 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్​లు) సునామీ ఇన్నింగ్స్​తో చెలరేగింది. లారా వోల్వార్ట్​(77; 38 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్స్​లు), జెమీమా రోడ్రిగ్స్​(15; 9 బంతుల్లో 2 ఫోర్లు) మ్యాచ్​ ను చివరి ఓవర్​ వరకు తీసుకెళ్లారు. ఆఖరి ఓవర్​లో విజయానికి 7 పరుగులు అవసరం కాగా.. లారా, వోల్వార్ట్​లను ఔట్​ చేసి సోఫీ డివైన్​ తన జట్టు (Gujarat Giants) కు విజయం కట్టబెట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>