కలం, వెబ్డెస్క్: డైరెక్టర్ మారుతి (Director Maruthi).. ‘ఈరోజుల్లో’ అంటూ చిన్న సినిమాతో పెద్ద విజయం సాధించాడు. టాలీవుడ్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ‘ది రాజాసాబ్’ మూవీ తీశాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్ వైడ్ రిలీజ్కి రెడీ అవుతోంది. అయితే.. మారుతికి కామెడీ చిత్రాలు బాగా తీయగలడు అనే పేరుంది. ఇప్పుడు రాజాసాబ్ (Raja Saab) ట్రైలర్ చూస్తుంటే.. ఇందులో హర్రర్తో పాటు కామెడీనీ బాగా డీల్ చేశాడనే టాక్ వచ్చింది. ఈ క్రమంలో మారుతి ఓ పాడ్కాస్ట్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పి షాక్ ఇచ్చాడు. ఇంతకీ.. ఆ డ్రీమ్ ఏంటంటే.. ఐదుగురు స్టార్ హీరోలతో ‘పంచతంత్రం’ లాంటి సినిమా తీయాలని ఉందని చెప్పాడు.
ఆ ఐదుగురు స్టార్ హీరోలు ఎవరంటే.. మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్తో పాటు యూనివర్సల్ హీరో కమల్హాసన్. ఈ ఐదుగురితో కలిపి పంచతంత్రం లాంటి సినిమా తీయాలని ఉందట. ఇదేదో సరదాగా అనుకోవడం లేదట. దీని కోసం సీరియస్గా ప్రయత్నం కూడా చేస్తానని.. పాడ్కాస్ట్లో చెప్పి అందరినీ సర్ఫ్రైజ్ చేశాడు మారుతి. ఈ సినిమా తీస్తే.. థియేటర్ బ్లాస్ట్ అవుతుంది. ఆ ఒక్క సినిమా చాలు చెప్పుకోవడానికి అని చెప్పాడు.
అయితే.. ఈ డ్రీమ్ గురించి వినడానికి బాగానే ఉంది కానీ.. నిజంగా జరుగుతుందా అంటే దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. ఎందుకంటే.. మన స్టార్ హీరోలు ఇద్దరు కలిసి నటించడమే కష్టం. చిరు, బాలయ్య, నాగ్, వెంకీ.. ఈ నలుగురూ కలసి నటించడమంటే అసాధ్యమే. ఇప్పటివరకు వీరిలో ఏ ఇద్దరూ కలసి ‘మల్టీ స్టారర్’లో నటించలేదు. ఇప్పుడు చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో వెంకీ ముఖ్యపాత్ర పోషించాడు. అంతకుమించి ఏ సినిమా రాలేదు. అలాంటిది మన టాప్ స్టార్స్ నలుగురితో పాటు కమల్హాసన్ కూడా నటించడం అంటే.. జరగకపోవచ్చు. ఒకవేళ జరిగితే మాత్రం అద్భుతమే. మరి.. మారుతి కల నిజం అవుతుందో.. లేక కల గానే మిగిలిపోతుందో చూడాలి.

Read Also: బన్నీ, లోకేష్ కాంబో వెనుక ఏం జరుగుతోంది..?
Follow Us On: Pinterest


