ఉన్మత్త భైరవ ఆలయంలో మహా పాలాభిషేకం

కలం, హనుమకొండ : హనుమకొండ పద్మాక్షి రోడ్ మారుతి హిల్స్ లో గల శ్రీ వారాహి సహిత ఉన్మత్త భైరవ దేవాలయం (Unmatta Bhairava Temple) లో శుక్రవారం మహా పాలాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి, స్వామివారికి 108 లీటర్ల ఆవుపాలతో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు వీరభద్రనాధ్ మాట్లాడుతూ.. ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనదని, వందేళ్లకు ఒకసారి వచ్చే ఈ అమావాస్య రోజు భక్తిశ్రద్ధలతోటి భక్తులు పాల్గొని కూష్మాండ దీపం, మిరియాల దీపం, నారీకేల దీపాలు పెట్టి వారి భక్తిని చాటుకుంటారని అన్నారు. అమ్మవారికి, స్వామివారికి అంత్యంత వైభవంగా అలంకరణ, మహా హారతి, అన్నదాన ప్రసాదం నిర్వహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>