కలం, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా డోన్ (Dhone) పట్టణంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కర్నూలు నుంచి డోన్కు వస్తున్న ఆర్టీసీ బస్సుకు ఐటీఐ సమీపంలో భార్యాభర్తలు వెళ్తున్న స్కూటీ అడ్డువచ్చింది. వారిని తప్పంచబోయే క్రమంలో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు డివైఢర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

