కొత్తగూడెం వాసికి జాతీయ స్థాయిలో గౌరవం

​కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం (Kothagudem) పట్టణానికి చెందిన విఠల్ జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. శాంతియుత ఆర్థికాభివృద్ధి, ఆర్థిక అహింస దిశగా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపు లభించింది. ‘ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (ECI) ఆయనను నేషనల్ కోఆర్డినేటర్‌గా నియమించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌరవ్ అగర్వాల్ జారీ చేసిన నియామక ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి.

​ఆర్థిక సోదరభావం, విధాన రూపకల్పన, ప్రభుత్వ-కార్పొరేట్ సంస్థల సమన్వయం ద్వారా దేశ ఆర్థిక పురోగతికి కట్టుబడి పనిచేస్తానని ఈ సందర్భంగా విఠల్ తెలిపారు. సంస్థ నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శకతతో బాధ్యతలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. విఠల్ నియామకంపై జిల్లాకు చెందిన పలు ప్రజా సంఘాలు, ఆర్థిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>