కలం, స్పోర్ట్స్: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో జరుగుతున్న వరుస మార్పులపై ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) తనదైన శైలిలో చురకలంటించారు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ను ఉద్దేశించి ఆయన వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టుకు ముందు పాకిస్థాన్ ఏకంగా ఏడుగురు ఆటగాళ్లతో పాటు ఇద్దరు కోచ్లను తొలగించింది. ఈ మార్పులపై పీటర్సన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
ప్రతి మ్యాచ్ ముందు కెప్టెన్ల ఇంటర్వ్యూలో మార్పుల గురించి అడుగుతారని, పాక్ జట్టులో ఇన్ని మార్పుల వల్ల తన మిత్రుడు బాబర్కు అది అతి సుదీర్ఘమైన ఇంటర్వ్యూ అవుతుందని ఎద్దేవా చేశారు. దీనికోసం టాస్ ప్రక్రియను మ్యాచ్కి ముందు రోజు రాత్రే మొదలుపెట్టాలేమో అని సరదాగా పోస్ట్ పెట్టారు. ఈ సిరీస్లో లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 103 పరుగులు, లార్డ్స్లో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఘోర ఓటమి చవిచూసింది.
ఈ రెండు ఓటముల తర్వాతి పరిణామాలపై పీటర్సన్ (Kevin Pietersen) వేసిన పంచులతో పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయాలు ఎంత విచిత్రంగా ఉన్నాయో తేటతెల్లమవుతోంది. జట్టు విషయానికి వస్తే మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-వుల్-హక్ వంటి సీనియర్లను పక్కనపెట్టి, సైమ్ అయూబ్తో పాటు నలుగురు అరంగేట్రం చేయని కొత్త ఆటగాళ్లకు పాక్ అవకాశం ఇచ్చింది. రెడ్ బాల్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ స్థానంలో మైక్ హెస్సన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Also Read : పాక్ క్రికెట్ పరువు తీశారు: రమీజ్ ఫైర్
Follow Us On : WhatsApp

