టీమిండియాకు బిగ్ బూస్ట్: రేసులో కీలక ఆల్‌రౌండర్లు!

కలం, స్పోర్ట్స్ : ఆఫ్ఘనిస్తాన్‌తో ఈ నెల 13 నుంచి ఢిల్లీలో జరగబోయే మూడు T20ల సిరీస్‌కు ముందు టీమిండియాకు (Team India) భారీ ఊరట లభిస్తోంది. గాయాల నుంచి కోలుకుంటున్న స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిస్థాయిలో కోలుకుని పునరాగమనానికి సిద్ధమయ్యారు. మరొక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఫిట్‌నెస్ సాధించేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. అజిత్ అగార్కర్ నాయకత్వంలోని జాతీయ ఎంపిక సంఘం ఈ వారంలోనే సమావేశమై జట్టును ఎంపిక చేయనుంది. బెంగుళూరులోని బెంగళూరు BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో నితీశ్ రెడ్డి, పాండ్యాలు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

చెన్నై నుంచి వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి CoEలో చేరనున్నారు. రాబోయే T20 సిరీస్ ద్వారా సుందర్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో మేనేజ్‌మెంట్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇటీవలే శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమైన ఆయన, రాబోయే న్యూజిలాండ్ టెస్టుల దృష్ట్యా వర్క్‌లోడ్‌ను నియంత్రిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ T20 సిరీస్‌కు బుమ్రా లభ్యత అనుమానంగానే ఉన్నప్పటికీ, ఆసియా గేమ్స్ సమయానికి ఆయన పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరోవైపు ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ గత మ్యాచ్‌ల్లో ఆకట్టుకోలేకపోవడంతో కృణాల్ పాండ్యా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 14 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేసిన కృణాల్‌ను మళ్లీ T20 జట్టులోకి తీసుకునేందుకు సెలెక్టర్లు యోచిస్తున్నారు. ఫిట్‌నెస్ పరీక్షల అనంతరం సెలెక్టర్లు ఈ కీలక నిర్ణయాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>