శ్రీలంకలో భారత్ టెస్ట్ సిరీస్ కైవసం: వెలుగులోకి కొత్త స్టార్లు!

కలం, స్పోర్ట్స్ : శ్రీలంక పర్యటనను టీమిండియా 1-0తో టెస్ట్ సిరీస్ విజయంతో ముగించింది. ఇటీవల ముగిసిన కొలంబో టెస్ట్ డ్రాగా ముగిసినా, గాలేలో సాధించిన విజయంతో సిరీస్ (India vs Sri Lanka) భారత్ వశమైంది. ఈ పర్యటన ద్వారా భారత జట్టుకు పలువురు యువ ఆటగాళ్ల రూపంలో అద్భుతమైన ప్రతిభ లభించింది. ఈ సిరీస్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శన ఇచ్చారు.

ఆయన మూడు ఇన్నింగ్స్‌ల్లో 328 పరుగులు సాధించారు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. సిరీస్ ఆరంభానికి ముందు స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు కోచ్ మహమ్మద్ నసీరుద్దీన్‌తో కలిసి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలిసింది. ఆయన ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. పడిక్కల్ నిలకడైన బ్యాటింగ్‌పై కేప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధ్రువ్ జురెల్ జట్టుకు సాంకేతిక బలాన్ని అందించారు.

వికెట్ కీపర్ బ్యాటర్ అయిన జురెల్, పరిస్థితికి తగ్గట్లు బ్యాటింగ్ చేస్తూ అలరించారు. రెండో టెస్టులో 115 పరుగులతో సెంచరీ సాధించి జట్టుకు భారీ స్కోరు అందించారు. బౌలింగ్ విభాగంలో ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ ఆకట్టుకున్నారు. గాలే టెస్టులో 10 వికెట్లు తీసి జట్టు విజయానికి ముఖ్య కారణమయ్యారు. కొలంబో పిచ్ మందగించినా, వేగాన్ని పెంచి 6 వికెట్లు పడగొట్టారు. సుతార్ పట్టుదలను స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే ప్రశంసించారు.

ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ వేగంతో బౌలింగ్ చేస్తూ ప్రభావం చూపారు. మరోవైపు సీనియర్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తక్కువ వికెట్లు తీసినప్పటికీ, ఆయన నాయకత్వ లక్షణాలు జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తెలిపారు. చివరి ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాటర్లు 154 ఓవర్ల పాటు పోరాడి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు. అరంగేట్రం చేసిన స్పిన్నర్ సారాంశ జైన్ ప్రభావం చూపలేకపోయారు. అయినప్పటికీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్ విజయాన్ని సానుకూలంగా భావిస్తున్నారు. ఈ విజయం భారత టెస్టు జట్టుపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>