కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేరుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు ఆమె ఆయన నివాసానికి విచ్చేశారు. ముఖ్యమంత్రికి రాఖీ శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఇప్పటికే కొండా సురేఖ ముందుగానే సీఎం అపాయింట్మెంట్ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నేరుగా జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి చేరుకున్నారు.

