అభిషేక్‌ పొరెల్‌కు బెయిల్‌ నిరాకరణ.. 14 రోజుల కస్టడీ

క‌లం, వెబ్‌డెస్క్‌: రేప్‌, బ్లాక్‌మెయిల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ క్యాపిటల్స్‌, బెంగాల్‌ క్రికెటర్‌ అభిషేక్‌ పొరెల్‌ (Abhishek Porel)కు కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్‌ నిరాకరించిన కోర్టు.. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించింది. మెడికల్‌ విద్యార్థినిగా చెప్పబడుతున్న ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పొరెల్‌పై కేసు నమోదైంది. ఆగస్టు 11న హుగ్లీలో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. అంతకుముందు ఫిర్యాదుపై పోలీసులు పొరెల్‌ను విచారించారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత చిన్సురా కోర్టులో హాజరుపరిచారు.

యువతి ఫిర్యాదు ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి పొరెల్‌ తనతో సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంబంధం ముగిసిందని తెలిపింది. తన ప్రైవేట్‌ ఫొటోలను బయటపెడతానంటూ బెదిరించినట్లు ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 19 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటిలో ఎక్కువ సెక్షన్లు బెయిల్‌ పొందడం కష్టమైనవిగా ఉన్నాయి. ఫిర్యాదులో ఢిల్లీలో 2026 ఏప్రిల్‌ 2న జరిగినట్లు చెబుతున్న మరో ఘటనను కూడా ప్రస్తావించారు.

ఆ సమయంలో తనను నిర్బంధించారని, ఆహారం ఇవ్వలేదని యువతి ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగా ఒంటరిగా ఉంచడంతో శారీరకంగా బలహీనపడిపోయానని, సరిగా నడవలేకపోయానని పేర్కొంది. కేసు నమోదైన తర్వాత పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొరెల్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్‌ నిరాకరించి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>