కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. BRS శ్రేణులు, చిన్నారులు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్బంగా జాతీయ గీతాలాపన అనంతరం దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన త్యాగ ధనులను స్మరించుకున్నారు.

