కలం, ధర్మపురి: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ధర్మపురి (Dharmapuri) క్షేత్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నా మని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) స్పష్టం చేశారు. స్థానికంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ధర్మపురి రూపురేఖలు మారనున్నట్లు తెలిపారు. గురువారం ధర్మపురి 15వ వార్డు అంబేద్కర్ భవన నిర్మాణ పనులను మంత్రి అడ్లూరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి (Adluri Laxman) మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ధర్మపురి పట్టణంలోని వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ధర్మపురిలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అంబేద్కర్ భవన నిర్మాణం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. మరో రెండు అంతస్తుల్లో విద్యార్థుల చదువు కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని మంత్రి వివరించారు.
ధర్మపురి క్షేత్రం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి అన్నారు. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం రూ.117 కోట్లు కేటాయించగా ఇందులో ధర్మపురిలో రూ.37 కోట్లతో పనులు చేస్తున్నట్లు వివరించారు. వీటితోపాటు టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.15 కోట్లతో పాటు అమృత్ పథకం ద్వారా నిధులు సాధించి ధర్మపురిలో అభివృద్ధి పనులు కొనసాగిస్తామని మంత్రి వివరించారు. కుంభమేళా తరహాలో ధర్మపురి పుష్కరాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ధర్మపురి క్షేత్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ధర్మపురి రూపురేఖలు మారనున్న ట్లు మంత్రి వివరించారు. మంత్రి వెంట ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్ తోపాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
Also Read : స్టీల్ బ్రిడ్జికి ఆమె పేరు.. ముఖ్యమంత్రికి వీహెచ్ లేఖ
Follow Us On: Instagram

