కలం, నిర్మల్ : బాసర గోదావరి నది (Basara Godavari River) త్రిబుల్ ఐటీ వాటర్ పంపు సమీపంలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు బాసర సీఐ దీపక్ గురువారం తెలిపారు. మృతుడి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని, తెల్లని టీషర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని గోదావరి నది నుంచి బయటకు తీయించినట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ లేదా వివరాలు తెలిసిన వారు ఎస్హెచ్ఓ మొబైల్ నంబర్ 8712659540కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

