కలం, వెబ్డెస్క్: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) నేడు కర్రెగుట్టల్లో పర్యటించారు. కర్రెగుట్టపై జాతీయ జెండాను ఆవిష్కరించి, పావురాలను ఎగరవేశారు. ములుగు జిల్లాలోని తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న పామునూరు గ్రామస్తులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పామునూరు, తాడపాల, డోలీ వరకు రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరగా, 29 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణంపై డీజీపీ పరిశీలన చేశారు.
Also Read : పొంగులేటి Vs కౌశిక్ రెడ్డి.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో వాగ్వాదం
Follow Us On : WhatsApp

