కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా రామాయంపేట (Ramayampet) పట్టణంలో ముగ్గురు బాలురు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. రామాయంపేటలోని కేసీఆర్ కాలనీకి చెందిన ధనుష్, మనోజ్, షేక్ సమీర్ అనే ముగ్గురు బాలురు గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. వీరి వయసు 13 సంవత్సరాలు కాగా, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు.
గురువారం రాత్రి 9 గంటల వరకు కాలనీలోనే ఆడుకున్న ఈ బాలురు, ఆ తర్వాత ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో బంధువులు రామాయంపేట పోలీసు స్టేషన్(Ramayampet PS)లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ బాలుర కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
Also Read : మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ అంటారా?.. విద్యార్థినుల ఆందోళన
Follow Us On : WhatsApp

