కలం, వెబ్డెస్క్: గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్తో జగ్గారెడ్డి (Jaggareddy) భేటీ అయ్యారు. తుంగతుర్తి (Thungaturthi) నియోజకవర్గ పంచాయితీపై ఏడు పేజీల నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి మహేశ్ కుమార్కు అందజేశారు. ఈ నివేదిక తయారీకి జగ్గారెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు, మంత్రి ఉత్తమ్, తుంగతుర్తి ముఖ్య నాయకులు, మాజీ మంత్రి దామోదర రెడ్డి కుమారుడు సర్వోత్తమరెడ్డితో భేటీ అయి చర్చించారు.
తుంగతుర్తి కాంగ్రెస్ నాయకుల్లో కొద్ది రోజులుగా తీవ్ర విబేధాలు నెలకొన్నాయి. పార్టీ పదవుల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు హై కమాండ్ జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. జగ్గారెడ్డి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు.
Also Read : హరీశ్ రావు క్షుద్ర పూజలు నిజమే.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram

