కలం, వెబ్డెస్క్: అయోధ్య (Ayodhya)లోని రాజర్షి దశరథ్ మెడికల్ కాలేజీ (Rajarshi Dashrath Medical College) లో బాంబుల తయారీ వార్తలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కాలేజీలోని ఎక్స్ రే గదిలో దొరికిన ఓ డాక్యుమెంట్తో ఈ బాంబు తయారీ వార్తలు వైరల్గా మారాయి. వివరాల్లోకి వెళ్తే… శనివారం సాయంత్రం కాలేజీ యాజమాన్యం ఎక్స్ రే గదిలో ఓ డాక్యుమెంట్ను గుర్తించింది. ఇందులో బాంబుల తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి రాసి ఉంది. దీనిపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి సర్ఫరాజ్ అనే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి సర్ఫరాజ్ స్వయంగా తన చేతి రాతతో ఈ డాక్యుమెంట్ రూపొందించాడు. సర్ఫరాజ్ ఉత్తర్ ప్రదేశ్లోని బలరాంపూర్కు చెందిన వాడిగా గుర్తించారు. శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న ఇద్దరు సిబ్బందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

