కలం, వెబ్డెస్క్: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా వేళ శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యస్థీకరణ జరుగనున్న నేపథ్యంలో విద్యా శాఖ మంత్రిగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) బాధ్యతలు స్వీకరిస్తారని సంజయ్ రౌత్ అన్నారు. మరోవైపు హై కమాండ్ పిలుపుతో సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఈ ఇద్దరు నేతలతో ఏం చర్చిస్తుంది, తదుపరి విద్యా శాఖ బాధ్యతలు ఎవరు తీసుకుంటున్నారన్నది హాట్ టాపిక్గా మారింది.
Read Also: నా సలహా మేరకే ధర్మేంద్ర రాజీనామా.. శరద్ పవార్ సంచలన స్టేట్మెంట్
Follow Us On : WhatsApp

