కలం, వెబ్డెస్క్: తెలంగాణలో మరో పరువు హత్య (Honour Killing) జరిగింది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని కన్న కూతుర్ని కిరాతకంగా హత్య చేశారు తల్లిదండ్రులు. ఈ సంఘటన కరీంనగర్(Karimnagar) జిల్లా సైదాపూర్ మండలంలో కలకలం సృష్టించింది. కేసుకు సంబంధించిన వివరాలను హూజూరాబాద్ ఏసీపీ మాధవి గురువారం వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదిరోజుల కిందట చనిపోయింది. కడుపు నొప్పి తాళలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఇది పరువు హత్యగా తేలింది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు, బాలిక ప్రేమించుకున్నారు. విషయం తెలియడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కూతురుకు బలవంతంగా పురుగుల మందు తాగించి, ఆపై గొంతు నులిమి చంపేశారు. విచారణలో హత్య చేసినట్లు నిందితులు అంగీకరించడంతో పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: ట్యాపింగ్ విషయం ఎప్పుడు తెలిసింది? : మాజీ డీజీపీని ప్రశ్నించిన సిట్
Follow Us On: Instagram


