కరీంనగర్ డెయిరీ ఛైర్మన్‌కు సత్కారం

కలం, కరీంనగర్ బ్యూరో: అమెరికాకు చెందిన మేరీల్యాండ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న కరీంనగర్ డెయిరీ ఛైర్మన్ చలిమెడ రాజేశ్వరరావు (Chalimeda Rajeshwara Rao)ను కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సత్కరించారు. 40 సంవత్సరాలుగా డెయిరీని విజయపథంలో నడిపిస్తూ, పాడి పరిశ్రమలో చేసిన విప్లవాత్మకమైన కృషికి, విశేష సేవలకు గుర్తింపుగానే గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు అభినందించారు.

వేలాది మంది పాడి రైతుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ కరీంనగర్ డెయిరీకి రాజేశ్వరరావు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని ప్రశంసించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి మరిన్ని నూతన కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>