చండూరు గ్రంథాలయ పాలకుడికి పదవీ విరమణ వీడ్కోలు

కలం, చండూరు: ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పనిసరని చండూరు (Chandur) మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు.  13 సంవత్సరాలుగా చండూరు గ్రంథాలయ పాలకుడిగా పనిచేస్తున్న యుగంధర్ ఆదివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. 2012 నుంచి చండూర్‌లోనే విధులు నిర్వర్తించారని, గ్రంథాలయ అభివృద్ధికి తోడ్పాటు అందించారన్నారు.

ఈ సందర్భంగా యుగంధర్ దంపతులను తోటి ఉద్యోగులు, పలువురు నేతలు శాలువాలు, పూలమాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బూతరాజు దశరథ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్, నూతన గ్రంథాలయ పాలకులు నర్మదా, లాల్ మహమ్మద్, ఉపాధ్యాయులు సుధాకర్, పంచాయతీ సెక్రటరీ కిరణ్, సరికొండ వెంకన్న పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>