కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోదీ (PM Modi) సోమవారం నుంచి మూడు రోజుల పాటు మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా తొలుత ఆయన సోమవారం ఇండోనేషియా చేరుకుంటారు.
2016 తర్వాత ఇండోనేషియా వెళ్తున్న ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు సుబియాంటోతో సమావేశమై ఇరుదేశాల సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఈ పర్యటనలో ముఖ్యంగా ‘‘బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్’’ ఒప్పందం కీలకంగా మారనుంది. ఈ క్షిపణి వ్యవస్థను దశలవారీగా కొనుగోలు చేసే విషయంపై చర్చించే అవకాశం ఉంది. పర్యటనలో భాగంగా రాజధాని జకార్తాలో ప్రవాస భారతీయులతోనూ మోదీ భేటీ కానున్నారు. అలాగే ప్రఖ్యాత ప్రాంబనన్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు.

