కలం, చండూరు: చండూరు (Chandur) ఉన్నత పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రస్థాయి అధికారుల బృందం శుక్రవారం చండూర్ హైస్కూల్ను పర్యవేక్షించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తరుపున అడిషనల్ డైరెక్టర్ కె.లింగయ్య పాఠశాలకు సంబంధించిన మౌళిక వసతుల రూపకల్పన కోసం స్థలాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులను సంబంధిత పాఠశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాధికారి పి. సుశీందర్ రావు, మండల విద్యాధికారి వి. సుధాకర్ రెడ్డి, ఇన్చార్జ్ ఉపాధ్యాయిని విజయలక్ష్మి వారి వెంట ఉన్నారు.

