కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఇప్పటివరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar)లో పలుమార్లు పర్యటించారు. కొడంగల్ కు మొదటిసారి 21 ఫిబ్రవరి 2024, వనపర్తి పర్యటన 2 మార్చి 2025, సొంత ఊరు కొండారెడ్డిపల్లికి మొదటి పర్యటన 12 అక్టోబర్ 2024 రోజున వచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ కు 5 సార్ల కంటే ఎక్కువ వెళ్లారు.
2004 ఫిబ్రవరి 21న కొడంగల్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజున నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2 అక్టోబర్ 2025 (దసరా సందర్భంగా), 24 నవంబర్ 2025 (అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం), 8 మే 2026 (దేవాలయ పునరుద్ధరణ పనులు), 4 జూన్ 2026 న కూడా పర్యటించారు. రేవంత్ రెడ్డి తాను చదువుకున్న వనపర్తికి సీఎం అయిన తర్వాత 2 మార్చి 2025న వెళ్లారు. ఆ రోజున తన చిన్ననాటి స్నేహితులను, కాలేజీ మిత్రులను కలుసుకొని, తాను అద్దెకు ఉన్న ఇంటిని సందర్శించి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
సీఎం సొంత గ్రామానికి రెండుసార్లు..
ఆయన తన సొంత గ్రామం కొండారెడ్డిపల్లి (నాగర్ కర్నూల్ జిల్లా)కి ఇప్పటివరకు ముఖ్యంగా రెండుసార్లు వెళ్లారు. 12 అక్టోబర్ 2024న దసరా పండుగ సందర్భంగా సీఎం హోదాలో మొదటిసారి తన గ్రామానికి వెళ్లారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 2 అక్టోబర్ 2025న మరొకసారి దసరా వేడుకల కోసం వెళ్లారు. సీఎం అయిన తర్వాత ఉమ్మడి జిల్లాలో (మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల) అభివృద్ధి పనులు, సమీక్షలు, ఎన్నికల ప్రచారాల కోసం సుమారు 10 సార్ల కంటే ఎక్కువ పర్యటించారు.
ముఖ్యమైన పర్యటనలలో 17 జనవరి 2026 (ఐఐఐటీ శంకుస్థాపన), 4-5 జూన్ 2026 (రెండు రోజుల జిల్లా పర్యటన), ఈ సందర్భంగా జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల గురించి అక్కడికక్కడే ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. అంతకుముందు మే 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించారు.

