Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంగ్లండ్ గడ్డపై టీ20లో భారత్ టాప్-5 విధ్వంసకర ఇన్నింగ్స్

కలం, స్పోర్ట్స్: ఐర్లాండ్ చేతిలో 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇప్పుడు మరో పెద్ద సవాల్‌కు సిద్ధమైంది. జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో (IND vs ENG)  ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై భారత బ్యాటర్లు ఆడిన అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ మరోసారి చర్చకు వస్తున్నాయి. ఒత్తిడిని తట్టుకుని మ్యాచ్‌లను మలుపు తిప్పిన ఆ ఐదు ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచిపోయాయి.

1. రోహిత్ శర్మ

ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది రోహిత్ శర్మ ఇన్నింగ్స్. నిర్ణయాత్మక మూడో టీ20లో 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ 56 బంతుల్లో అజేయ శతకం సాధించాడు. 11 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగి భారత్‌కు ఏడు వికెట్ల విజయాన్ని అందించాడు. ఆ గెలుపుతో భారత్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

2. కేఎల్ రాహుల్

2018 సిరీస్ తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అజేయ శతకంతో ఇంగ్లండ్ బౌలర్లను చిత్తు చేశాడు. 54 బంతుల్లో 101 పరుగులు చేసి భారత్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో విజయానికి చేర్చాడు. ఆ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

3. సూర్యకుమార్ యాదవ్

215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ త్వరగా వికెట్లు కోల్పోయింది. అలాంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 55 బంతుల్లో 117 పరుగులు చేసి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. అయితే అతడి శతకం జట్టును గెలిపించలేకపోయింది.

4. హార్దిక్ పాండ్యా

2022 సిరీస్ తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 33 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. బంతితో కూడా నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. భారత్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

5. విరాట్ కోహ్లీ

2014 ఇంగ్లండ్ పర్యటనలో టెస్టుల్లో నిరాశపరిచిన విరాట్ కోహ్లీ, ఏకైక టీ20లో మాత్రం బ్యాట్‌తో మెరిశాడు. 41 బంతుల్లో 66 పరుగులు చేసి చివరి వరకు పోరాడాడు. అయినా భారత్ లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో ఆగిపోయింది.

హార్దిక్ లేనిలోటే.. ఐర్లాండ్ చేతిలో ఓటమి: జాఫర్ వ్యాఖ్యలు

ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌ను 0-2తో కోల్పోయిన టీమిండియాపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టులో హార్దిక్ పాండ్యా లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్ లేకపోవడమే ప్రధాన లోటుగా కనిపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఓటమి తర్వాత జాఫర్ మాట్లాడుతూ, హార్దిక్ పాండ్యా కొత్త బంతితో బౌలింగ్ చేయడమే కాకుండా కనీసం మూడు ఓవర్లు వేస్తాడని గుర్తు చేశారు. అలాగే చివర్లో ఫినిషర్‌గా కూడా జట్టుకు కీలక పాత్ర పోషిస్తాడని చెప్పారు. ప్రస్తుతం ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

రెండో టీ20లో ఆడిన 23 ఏళ్ల ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గే గురించి కూడా జాఫర్ మాట్లాడారు. ప్రస్తుతం అతనిలో వరుసగా మూడు నుంచి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసే సామర్థ్యం కనిపించడం లేదని చెప్పారు. నితీశ్ కుమార్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని, ఇద్దరూ ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదని అభిప్రాయపడ్డారు. అందుకే హార్దిక్ లేకపోవడం జట్టుపై ప్రభావం చూపుతోందన్నారు. ఈ పరిస్థితిలో పేస్ బౌలర్లు మరింత బాధ్యత తీసుకోవాలని, బ్యాటర్లు కూడా ప్రత్యర్థి కంటే మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉందని సూచించారు.

అయితే ఈ సిరీస్‌లో కొన్ని సానుకూల అంశాలు కూడా కనిపించాయని జాఫర్ అన్నారు. హర్షిత్ రాణా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడని చెప్పారు. ఎనిమిదో లేదా తొమ్మిదో స్థానంలో అతనిపై నమ్మకం పెట్టుకోవచ్చని అభిప్రాయపడ్డారు. రెండో మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్ కూడా వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడన్నారు. కానీ మొత్తం జట్టు ప్రదర్శన, ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం మాత్రం నిరాశపరిచిందని పేర్కొన్నారు.
ఈ సిరీస్‌లో హర్షిత్ రాణా రెండు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయడమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా ఉపయోగపడాడు. మరోవైపు అరంగేట్ర మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

ఇక ముందు ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్ భారత్‌కు (IND vs ENG) మరింత కఠినంగా ఉంటుందని జాఫర్ అభిప్రాయపడ్డారు. ఐర్లాండ్ పూర్తి బలమైన భారత జట్టును ఓడించడంతో ఇంగ్లండ్ కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందని చెప్పారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం జట్టుకు పెద్ద లోటేనని పేర్కొన్నారు. ఆ బాధ్యతను ఇతర ఆటగాళ్లు భర్తీ చేయాల్సి ఉంటుందని, ఐర్లాండ్ సిరీస్ ఓటమిని హెచ్చరికగా తీసుకుని ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్ తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ జూలై 1న జరుగుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>