కలం, కరీంనగర్ బ్యూరో : మొహర్రం సందర్భంగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) శుక్రవారం ధర్మపురిలో వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని నంది చౌరస్తాలో పీరీలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా హిందూ, ముస్లింలు సోదరభావంతో కలిసి పీర్ల పండుగ జరుపుకుంటారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో భవిష్యత్తు తరాల కోసం ఇదే సంస్కృతిని కొనసాగించాలని మంత్రి కోరారు.

