కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డి పేట్ మండలం ధర్మారెడ్డి గ్రామ రైతులు (Kamareddy Farmers) యూరియా కోసం రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా, నిరసన రాస్తారోకో చేపట్టారు. యూరియా యాప్ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేసారు. చిన్న ఫోన్లు ఉన్న తాము యూరియా ఎలా బుక్ చెయ్యాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే యూరియా యాప్ తీసేసి రైతులకు పాత పద్ధతిలోనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇంకా భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.

