కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో (Tirupati) నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. వేదికపైకి వచ్చిన ఆయన, ప్రసంగం ప్రారంభించే ముందు చెప్పులు విడిచి భక్తి భావంతో ‘ఓం నమో వేంకటేశాయ’(Om Namo Venkatesaya) మంత్రాన్ని పఠించారు.
లోకేశ్ (Nara Lokesh) ఈ చర్య సభలో ఉన్న ప్రజలను ఆకర్షించడంతో పాటు భక్తి వాతావరణాన్ని సృష్టించింది. అనంతరం తన ప్రసంగంలో ప్రభుత్వ పనితీరును వివరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిపై తన భక్తిని ఈ విధంగా వ్యక్తం చేయడం ద్వారా ప్రజలతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని పెంచుకోవాలని లోకేశ్ భావించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పలువురు లోకేశ్ భక్తి భావాన్ని ప్రశంసిస్తున్నారు.
Read Also: పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి!
Follow Us On: Sharechat

