కలం, వెబ్డెస్క్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) రాష్ట్రపతి పాలనకు తెరపడనుంది. దాదాపు ఏడాది నుంచి ప్రెసిడెంట్ రూల్లో ఉన్న ఈ రాష్ట్రానికి కొత్త సీఎం రానున్నారు. భారతీయ జనతా పార్టీ నేత యమ్నం ఖేమ్చంద్ సింగ్ (Yamnam Khemchand) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఆయన మంగళవారం బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికవడం దీనికి సంకేతంగా భావిస్తున్నారు. అలాగే, మహిళా నేత నెమ్చా కిప్జెన్ డిప్యూటీ సీఎం కానున్నట్లు తెలుస్తోంది. 62 ఏళ్ల ఖేమ్చంద్.. సింగ్జమేయి అసెంబ్లీ స్థానం నుంచి, 63 ఏళ్ల కిప్జెన్.. కాంగ్పోక్పీ సీట్ నుంచి 2017, 2022లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు. మణిపూర్ అసెంబ్లీ పదవీ కాలం 2027 వరకు ఉంది.
మైతేయి, కుకీ జాతుల మధ్య సంఘర్షణతో అట్టుడికిన మణిపూర్లో గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత క్రమంగా పరిస్థితి సద్దుమణగడంతో రాష్ట్రపతి పాలన తొలగించడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలో కొత్త సీఎం (Yamnam Khemchand), డిప్యూటీ సీఎంలతో త్వరలోనే మణిపూర్లో ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది.
మణిపూర్ శాసనసభలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. ఇందులో 32 మంది బీజేపీ నుంచి గెలిచారు. ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ), జేడీయూ నుంచి ఆరుగురు చొప్పున, కాంగ్రెస్, నాగా ఫ్రంట్ నుంచి ఐదుగురు చొప్పున ఎన్నికయ్యారు. అలాగే కుకీ పీపుల్స్ ఫ్రంట్ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లు ముగ్గురు ఎన్నికయ్యారు.
Read Also: టారిఫ్స్ తగ్గించడానికి కారణాలివేనా?
Follow Us On: X(Twitter)


