దేశంలోనే ఫస్ట్ యాక్షన్ .. గ్యాస్ ఏజెన్సీ లైసెన్స్ రద్దు!

కలం, వెబ్​ డెస్క్​ : ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతూ దేశంలోనే మొదటిసారిగా ఒక కఠిన చర్యకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఆశిష్ గ్యాస్ ఏజెన్సీ యజమాని పవన్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను దాచిపెట్టి, వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు నిరూపితం కావడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కేవలం అరెస్టుతోనే సరిపెట్టకుండా, సదరు ఏజెన్సీకి ఉన్న లైసెన్స్‌ను కూడా అధికారులు తక్షణమే రద్దు చేశారు. వినియోగదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ అక్రమాలకు పాల్పడే ఏజెన్సీలపై రాజీలేని పోరాటం చేస్తామని ఈ చర్య ద్వారా యోగి ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు పంపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>