epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

బడ్జెట్ ఎఫెక్ట్.. కుప్పకూలిన సెన్సెక్స్​, నిఫ్టీ

కలం, వెబ్ డెస్క్:  ఎప్పుడూ లేనిది ఆదివారం కేంద్ర బడ్జెట్ (Union Budget)​ రావడంతో దానికి తోడు మన స్టాక్​ మార్కెట్​ కూడా ఫస్ట్​ టైమ్​ ఆదివారం ట్రేడ్​ అయింది. ఉదయం అక్కడక్కడే కదలాడిన ఇండెక్స్​ లు.. నిర్మలమ్మ బడ్జెట్​ స్పీచ్​ మొదలుపెట్టగానే కూలడం స్టార్​ చేశాయి. ఒకానొక సందర్భంలో కీలకమైన సెన్సెక్స్​ దాదాపు 2,500 పాయింట్లు (2.3 శాతం), నిఫ్టీ 500కుపైగా పాయింట్లు (2.5శాతం) నష్టపోయాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు 2 శాతానికిపైగానే పడిపోయాయి.

హెచ్ డీఎఫ్​ సీ, రిలయెన్స్​, ఐసీఐసీఐ వంటి స్టాక్స్ భారీగా నష్టాలను చవిచూశాయి. పొగాకు ఉత్పత్తులపై ట్యాక్స్​ ఉంటాయని నెలరోజులుగా వస్తున్న కథనాలతో ఇప్పటికే 15 శాతం పడిపోయిన ఐటీసీ స్టాక్​ ఈరోజు కూడా 3 శాతానికిపైగా కుప్పకూలింది. ఫార్మా, ఐటీ స్టాక్స్ మాత్రం గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి. మొత్తంగా ఇన్వెస్టర్లకు స్పెషల్​ ‘బడ్జెట్​ సండే’ (Sunday Union Budget) కాస్త ‘బ్లాక్​ సండే’గా మారింది.

కారణాలు:

1.స్టాక్ మార్కెట్లలోని ఫ్యూచర్స్​ పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్​ ట్యాక్స్​ (ఎస్​ టీటీ)ని 0.05%, ఆప్షన్స్​ పై 0.15 శాతం బడ్జెట్​ లో పెంచడం.
2.ప్రస్తుతం ఫ్యూచర్స్​ పై 0.02%, ఆప్షన్స్​ పై 0.1% ఉండగా.. దాన్ని భారీగా పెంచడం మార్కెట్​ వర్గాలకు నచ్చలేదు.
3.ఇలాంటి వాటి వల్ల ట్రాన్సాక్షన్​ ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫారెన్​ ఇన్వెస్టర్లు మన మార్కెట్​ నుంచి వెళ్లిపోతుండటంతో కేంద్రం ఎస్​ టీటీని మరింత పెంచడంతో వారు ఇంకా వెళ్లిపోయే అవకాశం కనిపిస్తున్నదని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also: సాదాసీదాగా కేంద్ర బడ్జెట్.. వరాలు లేవు.. వడ్డింపులు లేవు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>