తమిళనాడులో తప్పిన పెను ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన ప్రభుత్వ బస్సు!

కలం వెబ్ డెస్క్ : తమిళనాడులోని తెన్‌కాసి (Tenkasi Bus Accident) జిల్లాలో ప్రభుత్వ బస్సు అదుపు తప్పి నదిలోకి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. తెన్‌కాసి నుంచి తిరునెల్వేలికి 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రభుత్వ బస్సు(Government bus) , వెట్టైక్కారన్ కులం ప్రాంతానికి సమీపంలో అదుపు తప్పి నదిలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

అయితే నదిలో ప్రస్తుతం నీటి ప్రవాహం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. బస్సు నదిలోకి బోల్తా పడిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

17 మంది ప్రయాణికులకు గాయాలు

ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికుల సహకారంతో బస్సు నుంచి బయటకు తీసి, చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా, మరికొందరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి బస్సు అదుపు తప్పడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం, రహదారి పరిస్థితులు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>