కలం, వెబ్ డెస్క్: నేడు గ్యాస్ కంపెనీలతో తెలంగాణ సీఎస్ (Telangana CS) సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. గ్యాస్ కొరత, నివారణపై సమావేశంలో కీలక చర్చలు జరుగనున్నాయి. బ్లాక్ దందాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు అందించనున్నారు. ఇప్పటికే బుకింగ్ పద్ధతుల్లో మార్పులతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గ్యాస్ ఏజెన్సీల ముందు జనం క్యూ కడుతున్నారు. పలు చోట్ల అవసరాలకు సరిపడా సరఫరా లేక హోటళ్లు, హాస్టళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది.

