కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలోని పలు హోటళ్లలో టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు నిర్వహించింది. హోటళ్లలో వాడుతున్న 30 ఎల్పీజీ డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. కమర్షియల్ గ్యాస్ కొరత నేపథ్యంలో హోటళ్ల నిర్వాహకులు డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించారు. టాస్క్ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి, డీఎస్పీ శేఖర్ రెడ్డి, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు పవన్ కుమార్, శ్రీనివాస్, నిఖిల్ రాజ్, వినోద్, మహేష్ కుమార్లు దాడుల్లో పాల్గొన్నారు.

