కలం, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో గ్యాస్ కొరత వేధిస్తుండగా శ్రీలంక (Sri Lanka)లో ఇంధన సంక్షోభం మొదలైంది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన కొరతను, డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఇంధన కోటా వ్యవస్థను ప్రారంభించింది. ఈ విధానంలో కార్లకు 15 లీటర్లు, బైక్స్కి 5 లీటర్లు మాత్రమే ఇంధన సరఫరా చేస్తున్నారు. దీనికి క్యూఆర్ ఆధారిత పంపిణీ వ్యవస్థను అనుసరిస్తున్నారు. అన్ని వాహనాలకు పరిమితంగానే ఇంధనం సరఫరా జరుగుతోంది. దీంతో శ్రీలంక వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద జనం వాహనాలతో బారులు తీరారు.

