కామన్వెల్త్‌ గేమ్స్‌లో సర్వేశ్ కుషారే చరిత్ర.. హైజంప్‌లో భారత్‌కు తొలి రజతం

కలం, స్పోర్ట్స్: భారత్ హైజంప్ చరిత్రలో కొత్త పేజీ తిరిగింది. సర్వేశ్ కుషారే (Sarvesh Kushare) కామన్వెల్త్ గేమ్స్‌ (Commonwealth Games) లో రజత పతకం గెలిచాడు. ఈ విభాగంలో భారత్‌కు ఇదే తొలి సిల్వర్. గ్లాస్గో వేదికపై సర్వేశ్ 2.25 మీటర్లు దాటాడు. జమైకాకు చెందిన రొమైన్ బెక్‌ఫోర్డ్ కూడా అదే ఎత్తు దాటాడు. అయితే తొలి ప్రయత్నంలోనే బార్ దాటిన బెక్‌ఫోర్డ్‌కు స్వర్ణం దక్కింది. సర్వేశ్ మూడు ప్రయత్నాల్లో 2.25 మీటర్లు దాటడంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇద్దరూ 2.28 మీటర్ల ఎత్తును దాటలేకపోయారు.

పోటీ మొత్తం సర్వేశ్ ఆత్మవిశ్వాసంగా కనిపించాడు. ప్రతి ప్రయత్నానికి ముందు చిరునవ్వుతో అభిమానులను పలకరించాడు. చివరి ప్రయత్నానికి ముందు ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండాలని సంజ్ఞ చేశాడు. ఆ జంప్ విజయవంతం కాకపోయినా రజతాన్ని ఆనందంగా స్వీకరించాడు. పోటీ తర్వాత మాట్లాడుతూ 2.25 మీటర్లు తన అత్యుత్తమ ప్రదర్శన కాదని తెలిపాడు. ఇంకా ఎక్కువ ఎత్తు దాటగలనని నమ్మకం వ్యక్తం చేశాడు.

వాతావరణం అనుకూలంగా లేకపోవడం ప్రభావం చూపిందని వివరించాడు. మహారాష్ట్రలోని దేవగావ్ గ్రామంలో మొక్కజొన్న పొట్టులతో చేసిన తాత్కాలిక పిట్‌లో సాధన మొదలుపెట్టిన సర్వేశ్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, డైమండ్ లీగ్ వంటి పెద్ద టోర్నీల్లో పతకం దక్కకపోవడం బాధ కలిగించేదని చెప్పాడు. గ్లాస్గోలో ఆ లోటు తీరిందని తెలిపాడు.

గత నెల భువనేశ్వర్‌లో 2.31 మీటర్లు దాటి జాతీయ రికార్డును బద్దలు కొట్టిన సర్వేశ్ (Sarvesh Kushare), 2.30 మీటర్ల మార్క్ దాటిన తొలి భారత హైజంపర్‌గా నిలిచాడు. ఇదే ఫైనల్లో తేజస్విన్ శంకర్ మోకాలి గాయం కారణంగా మధ్యలోనే తప్పుకున్నాడు. అయినా చివరి వరకు మైదానంలో ఉండి సర్వేశ్‌కు అండగా నిలిచాడు. తమ మధ్య మంచి అనుబంధం ఉందని, తేజస్విన్ సహకారం ఎంతో ఉపయోగపడిందని సర్వేశ్ తెలిపాడు.

Read Also: జిమ్నాస్టిక్స్‌లో భారత్ ఫ్లాప్.. ఖాళీ చేతులతోనే వెనక్కి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>