కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ వేదికగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) లక్నోలోని సెంట్రల్ కమాండ్ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్ను వర్చువల్గా ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు, సంక్లిష్ట ప్రాంతాలలో విధులు నిర్వర్తించే భారత సైనికులకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ విభాగం ఎంతగానో తోడ్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన జవాన్లు ఎదుర్కొనే అంటువ్యాధులు, ఎండ, చలి తీవ్రతలు, అధిక ఎత్తులో వచ్చే అనారోగ్య సమస్యలు, అలసట, డీహైడ్రేషన్, పౌష్టికాహార లోపాలు వంటి సమస్యలకు అనుగుణంగా ఈ కొత్త విభాగం ప్రత్యేక వైద్య ప్రోటోకాల్స్ను అభివృద్ధి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
మారుతున్న ఆధునిక యుద్ధ తంత్రాల యుగంలో సంప్రదాయ ఆయుధాలతో పాటు రసాయన ఏజెంట్లు, జీవ ఆయుధాలు, రేడియోలాజికల్ డిస్పర్సల్ పరికరాల వంటి సరికొత్త ముప్పులు కూడా పొంచి ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) హెచ్చరించారు. ఈ తరుణంలో ఎదురయ్యే కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు, వాటిపై విస్తృత పరిశోధనలు, అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఈ సరికొత్త విభాగం ఒక ప్రధాన కేంద్రంగా పనిచేస్తుందని వివరించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లకు అత్యధికంగా సైనిక సహకారాన్ని అందిస్తున్న దేశాలలో భారత్ ఒకటిగా నిలిచిందని ఈ సందర్భంగా రక్షణ మంత్రి గుర్తుచేశారు.
Read Also: బీజేపీ నేతల పిల్లలు కూడా నిరసనలను సమర్థించారు: రాహుల్ గాంధీ
Follow Us On : WhatsApp

