కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఫోన్ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తూనే.. ఇటీవల తనకు రాసిన లేఖపై చర్చించినట్లు తెలుస్తోంది. ఓ టీవీ ఛానల్లో తనను టార్గెట్ చేసి, దురుద్దేశపూర్వకంగా కథనాలను రోజంతా ప్రసారం చేశారని లేఖలో రాహుల్ గాంధీకి పీసీసీ చీఫ్ వివరించారు. ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహేష్ కుమార్ గౌడ్కి మనోధైర్యం చెప్పిన రాహుల్ గాంధీ.. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించినట్లు చెబుతున్నారు.

