epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘పాలక్​ పన్నీర్​ వివక్ష’.. భారతీయ విద్యార్థులకు రూ.1.8కోట్లు పరిహారం

కలం, వెబ్​డెస్క్​: పాలక్​ పన్నీర్ (Palak Paneer)​ కూర కారణంగా ఎదురైన వివక్ష ఆ విద్యార్థులకు రూ.1.8కోట్లు పరిహారం వచ్చేలా చేసింది.  ఈ ఘటన అమెరికాలో జరిగింది. భారత్​కు చెందిన ఆదిత్య ప్రకాశ్​, ఊర్మి భట్టాచార్య అమెరికాలోని బౌల్డర్​ సిటీలో ఉన్న కొలరాడో యూనివర్సిటీలో పీహెచ్​డీ చదివేవాళ్లు. ఊర్మి అక్కడే అసోసియేట్​ టీచింగ్​ స్టాఫ్​గా పార్ట్​టైమ్​ జాబ్​ చేసేది. 2023లో ఓ రోజు ఇంటి నుంచి బాక్స్​లో తెచ్చుకున్న పాలక్​ పన్నీర్​ కూరను మైక్రోవేవ్​లో ఆదిత్య ప్రకాశ్​ వేడి చేశాడు. అయితే, దీనిపై  క్యాంటీన్​ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వాసన వస్తోందంటూ అడ్డుకున్నారు. దీంతో తాను కేవలం వేడి చేస్తున్నానని ఆదిత్య బదులిచ్చాడు. దీంతో మాటామాటా పెరిగి, ఆదిత్య ఆహారపు అలవాట్లను క్యాంటీన్​ సిబ్బంది వెక్కిరించారు. తక్కువ  చేసి మాట్లాడారు. క్యాంటీన్​ సిబ్బంది ప్రవర్తను, మాటలను ఊర్మి సైతం తప్పుబట్టారు.

దీంతో యాజమాన్యం వాళ్లపై కక్ష కట్టింది. పాలక్​ పన్నీర్​ (Palak Paneer) గొడవ గురించి పదే పదే మాట్లాడేందుకు పిలిచి ఇబ్బంది పెట్టారు. అలాగే ఊర్మిని ఉద్యోగం నుంచి తీసేశారు. దీనిపై ఆదిత్య, ఊర్మి స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఇది కచ్చితంగా జాతి వివక్షేనని న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు దాదాపు రెండేళ్లు కొనసాగింది. ఈ క్రమంలో యూనివర్సిటీ దిగొచ్చింది. భారతీయ విద్యార్థులకు జరిగిన అవమానానికి, కలిగిన ఇబ్బందికి పరిహారంగా రూ.2లక్షల డాలర్లు (రూ.1.8కోట్లు) ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే, భవిష్యత్తులో యూనివర్సిటీలో ఎలాంటి కోర్సు, ఉద్యోగం పొందకుండా నిషేధించింది. గత నెలలో భారత్​కు తిరిగొచ్చిన ఆదిత్య, ఊర్మి ఈ విషయంపై స్పందించారు. డబ్బు ముఖ్యం కాదని, వివక్ష ఎలాంటి రూపంలో తప్పేనని ‘ఎక్స్​’ వేదికగా పేర్కొన్నారు. కాగా, వారి పోరాటాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>