నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్.. త్వరలో వెండితెరపై మెరవనున్న తేజస్విని

కలం, వెబ్ డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని (Nandamuri Tejaswini) త్వరలో వెండితెరపై మెరవనున్నారు. ఓ స్పోర్ట్స్ డ్రామా కథతో తేజస్విని వెండితెర అరంగేట్రం చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కథను రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా, ఓ సందేశాత్మక చిత్రంగా మలిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

కాగా ఇటీవల తేజస్విని నెట్టింట షేర్ చేసిన ఒక డ్యాన్స్ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వీడియోలో తేజస్విని చూపిన అద్భుతమైన ఎనర్జీ, హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తేజస్విని సినిమాల్లోకి వస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు తేజస్విని వెండితెరపై కనిపించనుందనే వార్తతో నందమూరి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>