కలం, నిర్మల్: ముధోల్ ఎమ్మెల్యే (Mudhol MLA) పవార్ రామారావు పటేల్ శనివారం మహారాష్ట్రలో ఆలయాలను సందర్శించారు. మొదట ఛత్రపతి శంభాజీనగర్లో పర్యటించి, అక్కడ ప్రసిద్ధ భద్ర హనుమాన్ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం బుల్దానాలో చక్రధర్ స్వామి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్కు సాదర స్వాగతం పలికి.. ఆలయ విశిష్టత వివరించారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు తెలిపారు. ఈ సందర్భంగా బుల్దానాలో ఆశ్రమాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించి, నిర్వాహకులతో కొద్దిసేపు మాట్లాడి.. భోజనం చేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు.

