కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta)లో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలుడు, నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉగాది సందర్భంగా గురువారం సెలవు కావడంతో బాలుడు నాలుగేళ్ల చిన్నారితో ఆడుకున్నాడు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయమై చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిపై పోక్సో (POCSO) కేసు నమోదైంది. పిల్లలకు ఫోన్లు ఇవ్వడంతోనే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అశ్లీల కంటెంట్ పిల్లలు చూడకుండా కఠిన చట్టాలు చేసినపుడే నేరాలను నియంత్రించవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

