కలం, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్ ఈ రోజు ఉదయం భేటీ కానుంది. 2026-27 ఆర్థిక బడ్జెట్ (Budget)కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ ఏడాది సుమారు రూ.3.48 లక్షల కోట్లతో ఆర్థిక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. మంత్రి పయ్యవుల కేశవ్ నేడు అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి అనిత ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం శాసన మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. బడ్జెట్లో ఏయే పథకాలకు ఎంత కేటాయిస్తారు? దానిపై వైసీపీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


