కలం, మక్తల్ : అజాగ్రత్తగా వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం వాటిల్లుతున్నదని, వాహనదారులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తమ కుటుంబాల్లో కన్నీటిని మిగల్చవద్దని మక్తల్ సీఐ రామ్ లాల్, ఎస్సై రాజు యాదవ్ అన్నారు. మక్తల్ పట్టణంలోని 167 వ జాతీయ రహదారిపై మంగళవారం మక్తల్ (Makthal Police) సీఐ రాంలాల్, ఎస్ఐ రాజు యాదవ్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలను నడపవద్దన్నారు. అలాగే కార్లు, స్కూల్ బస్సులు, భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు తగిన జాగ్రత్తలు పాటించాలని వారు సూచించారు.

