కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పార్టీ బాధ్యతలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) స్వీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలోనే ప్రజా సంక్షేమం కోసం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డికి మంచి సంబంధాలు ఉండటంతో రాజ గోపాల్ రెడ్డి వైసీపీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ తీసుకోబోయే నిర్ణయాలను బట్టి.. రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు ఉంటుందేమోనని రాజకీయ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

