40 ఏళ్ల ఉద్యమానికి ముగింపు.. మావోయిస్టు సమత సరెండర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేదని పోలీసులు చెబుతున్నప్పటికీ, ఇటీవల పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సుమారు 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన సమత (Kakarala Samatha) తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుదీర్ఘకాలం మావోయిస్టు కార్యకలాపాల్లో పనిచేసిన ఆమె జనజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఈ పరిణామం నేపథ్యంలో ముప్పల లక్ష్మణరావు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఇతర సభ్యులు కూడా హింసా మార్గాన్ని వీడాలని తెలంగాణ డీజీపీ ఆనంద్ పిలుపునిచ్చారు. సమత లొంగుబాటు నేపథ్యంలో రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాల పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>