జార్ఖండ్ స‌ర్కార్ కీల‌క‌ నిర్ణ‌యం!

క‌లం, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో విద్యార్థుల ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో జార్ఖండ్ స‌ర్కార్ (Jharkhand Govt)కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వివాదాస్పద టీడీపీఎల్ ఆధ్వర్యంలో జరిగిన జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ (JSSC-CGL) సహా అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్‌ ప్రకటించారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంస్థ నిర్వహించిన పరీక్షలు, విడుదల చేసిన ఫలితాలు, ఎంపికైన అభ్యర్థుల ప్రక్రియ వంటి అన్నింటిని రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు.

అలాగే 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని పరీక్షలలోని అక్రమాలపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు. ఈ విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ నేతృత్వంలో ఒక పరీక్షల సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>