కలం, నారాయణపేట : జవహర్ నవోదయ విద్యా లయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు (Navodaya Admission) గడువును ఆగస్టు 7 వరకు పొడిగించారని కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువు తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రవేశాలకు https://cbseitms .rcil.gov.in/nvs/. సంప్రదించవచ్చని తెలిపారు.

