గ్యాస్​ కొరత.. సూర్యాపేటలో హోటల్స్​ బంద్​

కలం, వెబ్​ డెస్క్​ : అమెరికా – ఇజ్రాయెల్​, ఇరాన్ మధ్య యుద్ధం వంటింట్లో కాకరేపుతోంది. ఎల్పీజీ గ్యాస్​ కొరత (LPG Gas Crisis) కారణంగా హోటల్స్​, రెస్టారెంట్లు నడవలేని పరిస్థితికి చేరుకున్నాయి. మరీ ముఖ్యంగా కమర్షియల్​ గ్యాస్​ కొరత తీవ్ర రూపం దాల్చడంతో టిఫిన్​ సెంటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే హోటల్స్​, రెస్టారెంట్లలో మెనూ మార్పులు చేస్తూ ఐటమ్స్​ కుదిస్తున్నాయి. ఈ క్రమంలోనే సూర్యాపేటలో కమర్షియల్ గ్యాస్​ కొరత (LPG Gas Crisis) తీవ్ర ప్రభావం చూపుతోంది.

గ్యాస్​ అందుబాటులో లేకపోవడంతో మోటల్స్​, రెస్టారెంట్లు పనిచేయకుండా నిలిచిపోయాయి. టిఫిన్​ సెంటర్లు, టీ స్టాల్స్ కూడా బంద్​ అయ్యాయి. ఈ సమస్యలకు నిరసనగా హోటల్​ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వాహకులు బైక్​ ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. కమర్షియల్​ గ్యాస్ సరఫరాను వెంటనే సాధారణ స్థితికి తీసుకురావాలని, ప్రభుత్వం సహకరించాలని హోటల్​ జేఏసీ డిమాండ్​ చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>